Friday 16 September 2016

శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం

శ్రీవిద్యలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రధానమైనది. శ్రీ చక్రంలో కొలువు తీరిన దేవతలను ఈ స్తోత్రం స్తుతిస్తుంది. ఒక్క ఖడ్గమాల స్తోత్రం చదువుతూ శ్రీ చక్రానికి కుంకుమతో అర్చించినా పూర్ణ శ్రీవిద్యా పూజగా పరిగణింపబడుతుంది. .తీవ్ర సమస్యలు వచ్చినప్పుడు పూర్ణ భక్తి తో ఈ స్తోత్ర పారాయణం చేస్తే వెంటనే రక్షణ లభిస్తుంది. జటిలమైన సమస్యల పరిష్కారానికి ఈ స్తోత్రాన్ని ప్రతి రోజు 11 సార్లు పారాయణం 41 రోజుల పాటు చేస్తూ అన్ని నియమాలను పాటిస్తూ ఆచరించిన యెడల సత్వర సహాయం లభిస్తుంది.

చాలా జాగ్రత్తగా ఈ స్తోత్రాన్ని పఠించాలి. తప్పులు దొర్లకుండా పఠించాలి. ఈ స్తోత్రాన్నియే విధంగా పఠించాలో ఈ క్రింది వీడియో తెలుపుతుంది. దీనిని అనుసరించండి. చదవలేని వారు ఈ స్తోత్రం ప్రతిరోజూ విన్నా మెరుగైన ఫలితాలు కలుగుతాయి.

శ్రీమాత కృపా సిద్దిరస్తు..........

సూర్యదేవర వేణుగోపాల్
సుందరయ్య నగర్, మధిర   తెలంగాణా





No comments:

Post a Comment