Monday 30 March 2020

ధన్వంతరి స్తోత్రం- సకలరోగ నివారిణి



ధన్వంతరీ స్తోత్రం
దేవ వైద్యులైన ధన్వంతరి స్తోత్రం ఇది. ధన్వంతరిని  God  of Ayurveda అని అంటారు. ధన్వంతరి కృప కలిగితే  సకల జాడ్యాలు నశించి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. సకల పాప కర్మల్ని నశింపజేసి మంచి ఆరోగ్యాన్ని ధన్వంతరి కలిగిస్తారు.
శ్రీ నారాయణ స్వరూపమైన  ధన్వంతరిని ఆరోగ్యం కోసం  పూజించాలి. ప్రస్తుత పరిస్తితి లో కరోన వైరస్ విజృంభిస్తోంది. ఇటువంటి విష రోగాల నివారణకు నారాయణ స్వరూపమైన ధన్వంతరి కృప అందరికీ అవసరం. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి ఈ స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు పఠించండి. అపాయం నుండి తక్షణమే రక్షణ కలుగుతుంది. దేశ రక్షణకు స్వీయ రక్షణకు ఈ స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు పఠించడం అందరికీ అవసరం. ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం పఠించండి.
స్తోత్ర చివర ఇవ్వబడిన ధన్వంతరి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించాలి. స్తోత్రం  రోజుకి 3 సార్లు చదువలేని వారు ఈ మంత్రాన్ని 11 సార్లు  ఉదయం,
11 సార్లు మధ్యాన్నం, 11 సార్లు సాయంత్రం జపం చేసుకోవచ్చు.
||ఓం నమో నారాయణాయ||


శ్రీ ధన్వంతరి స్తోత్రం

నమో నమో విశ్వవిభావనాయ
నమో నమో లోకసుఖప్రదాయ
నమో నమో విశ్వసృజేశ్వరాయ
నమో నమో నమో ముక్తివరప్రదాయ
నమో నమస్తేఽఖిలలోకపాయ
నమో నమస్తేఽఖిలకామదాయ
నమో నమస్తేఽఖిలకారణాయ
నమో నమస్తేఽఖిలరక్షకాయ
నమో నమస్తే సకలార్త్రిహర్త్రే
నమో నమస్తే విరుజః ప్రకర్త్రే
నమో నమస్తేఽఖిలవిశ్వధర్త్రే
నమో నమస్తేఽఖిలలోకభర్త్రే

సృష్టం దేవ చరాచరం జగదిదం బ్రహ్మస్వరూపేణ తే
సర్వం తత్పరిపాల్యతే జగదిదం విష్ణుస్వరూపేణ తే
విశ్వం సంహ్రియతే తదేవ నిఖిలం రుద్రస్వరూపేణ తే
సంసిచ్యామృతశీకరైర్హర మహారిష్టం చిరం జీవయ
యో ధన్వన్తరిసంజ్ఞయా నిగదితః క్షీరాబ్ధితో నిఃసృతో
హస్తాభ్యాం జనజీవనాయ కలశం పీయూషపూర్ణం దధత్
ఆయుర్వేదమరీరచజ్జనరుజాం నాశాయ స త్వం ముదా
సంసిచ్యామృతశీకరైర్హర మహారిష్టం చిరం జీవయ
స్త్రీరూపం వరభూషణామ్బరధరం త్రైలోక్యసంమోహనం
కృత్వా పాయయతి స్మ యః సురగణాన్పీయూషమత్యుత్తమమ్
చక్రే దైత్యగణాన్ సుధావిరహితాన్ సంమోహ్య స త్వం ముదా
సంసిచ్యామృతశీకరైర్హర మహారిష్టం చిరం జీవయ
చాక్షుషోదధిసమ్ప్లావ భూవేదప ఝషాకృతే
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ

పృష్ఠమన్దరనిర్ఘూర్ణనిద్రాక్ష కమఠాకృతే
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ
ధరోద్ధార హిరణ్యాక్షఘాత క్రోడాకృతే ప్రభో
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ
భక్తత్రాసవినాశాత్తచణ్డత్వ నృహరే విభో
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ౧౦
యాఞ్చాచ్ఛలబలిత్రాసముక్తనిర్జర వామన
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ౧౧
క్షత్రియారణ్యసఞ్ఛేదకుఠారకరరైణుక
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ౧౨
రక్షోరాజప్రతాపాబ్ధిశోషణాశుగ రాఘవ
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ౧౩
భూభరాసురసన్దోహకాలాగ్నే రుక్మిణీపతే
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ౧౪

వేదమార్గరతానర్హవిభ్రాన్త్యై బుద్ధరూపధృక్
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ౧౫
కలివర్ణాశ్రమాస్పష్టధర్మర్ద్ద్యై కల్కిరూపభాక్
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ౧౬
అసాధ్యాః కష్టసాధ్యా యే మహారోగా భయఙ్కరాః
ఛిన్ధి తానాశు చక్రేణ చిరం జీవయ జీవయ ౧౭
అల్పమృత్యుం చాపమృత్యుం మహోత్పాతానుపద్రవాన్
భిన్ధి భిన్ధి గదాఘాతైః చిరం జీవయ జీవయ ౧౮
అహం న జానే కిమపి త్వదన్యత్
సమాశ్రయే నాథ పదామ్బుజం తే
కురుష్వ తద్యన్మనసీప్సితం తే
సుకర్మణా కేన సమక్షమీయామ్ ౧౯
త్వమేవ తాతో జననీ త్వమేవ
త్వమేవ నాథశ్చ త్వమేవ బన్ధుః
విద్యాహినాగారకులం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ ౨౦
న మేఽపరాధం ప్రవిలోకయ ప్రభోఽ-
పరాధసిన్ధోశ్చ దయానిధిస్త్వమ్
తాతేన దుష్టోఽపి సుతః సురక్ష్యతే
దయాలుతా తేఽవతు సర్వదాఽస్మాన్ ౨౧
అహహ విస్మర నాథ న మాం సదా
కరుణయా నిజయా పరిపూరితః
భువి భవాన్ యది మే న హి రక్షకః
కథమహో మమ జీవనమత్ర వై ౨౨
దహ దహ కృపయా త్వం వ్యాధిజాలం విశాలం
హర హర కరవాలం చాల్పమృత్యోః కరాలమ్
నిజజనపరిపాలం త్వాం భజే భావయాలం
కురు కురు బహుకాలం జీవితం మే సదాఽలమ్ ౨౩
క్లీం శ్రీం క్లీం శ్రీం నమో భగవతే జనార్దనాయ సకలదురితాని నాశయ నాశయ క్ష్రౌం ఆరోగ్యం కురు కురు హ్రీం దీర్ఘమాయుర్దేహి స్వాహా  ౨౪

ఫలశ్రుతిః

అస్య ధారణతో జాపాదల్పమృత్యుః ప్రశామ్యతి
గర్భరక్షాకరం స్త్రీణాం బాలానాం జీవనం పరమ్ ౨౫
సర్వే రోగాః ప్రశామ్యన్తి సర్వా బాధా ప్రశామ్యతి
కుదృష్టిజం భయం నశ్యేత్ తథా ప్రేతాదిజం భయమ్ ౨౬
ఇతి సుదర్శనసంహితోక్తం అమృతసఞ్జీవన ధన్వన్తరి స్తోత్రమ్


సూర్యదేవర వేణుగోపాల్ 
మధిర ఖమ్మం జిల్లా తెలంగాణా





Saturday 28 March 2020

కరోన వైరస్- చదవాల్సిన స్తోత్రాలు.







కరోన వైరస్- చదవాల్సిన స్తోత్రాలు..



ప్రస్తుతం కరోన వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. హిందూ ధర్మ శాస్త్రాలలో ఇంకా గ్రంధాల్లో ఇటువంటి ఆపత్కర విపత్తులను అరికట్టడానికి ఎన్నో తరుణోపాయాలు సూచించారు. ఇటువంటి రోజుల్లో ఏయే స్తోత్రాలు చదవాలో ఈ క్రింద ఉదహరిస్తున్నాను. ఎవరికి వారు ఇళ్లలోనే ఉండి ఈ స్తోత్రాలను ఉదయం, సాయంత్రం పఠించండి. ఇవి స్వ రక్షణ తో పాటు దేశ రక్షణ కూడా ఉపకరిస్తాయి. పూర్తి నమ్మకం తో పఠించండి... ఈ స్తోత్రాలు అన్ని స్తోత్ర పుస్తకాలలో ఉంటాయి, లేకపోతే నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.


అన్నిటికన్నా ముఖ్యమైనది సంధ్యావందనం. సంధ్యావందన అర్హత ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దీనిని ఆచరించాలి. గాయత్రి మంత్రాన్ని విడిగా కాకుండా సంధ్యావందనం లో చేస్తే మంచి లాభం ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు కాబట్టి రోజు సహస్ర గాయత్రి చేస్తే దేశానికి మేలు చేసినవారౌతారు. వీలుంటే  త్రిసంధ్యలు ఆచరించండి. లేకపోతే కనీసం ఉదయ సంధ్య, సాయం సంధ్యలలో ఆచరించండి. గాయత్రి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చేయండి అంటే జపసంఖ్యను పెంచండి. 11,24 కాకుండా 108,508,1008 లు గా చేయండి. మీకూ మంచిది దేశానికి మంచిది. ఈ విపత్తు నుండి త్వరగా విముక్తి వస్తుంది. సంధ్యావందన అర్హత ఉన్నవార్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మిగిలినవారు వేరే స్తోత్రాలు పఠించవచ్చు.


అందరూ విధిగా ప్రతిరోజూ "ఆదిత్య హృదయ "స్తోత్రాన్ని ఉదయం, సాయంత్రం రెండు పూటలా చదవండి. "ఆరోగ్యం భాస్కారాదిచ్చేత్"  అని మన గ్రంధాలు చెప్తున్నాయి. ఆరోగ్యం కోసం సూర్య భగవానుని ఆరాధించాలి. కరోన వైరస్ నుండి ప్రపంచాన్ని రక్షించమని ప్రతిరోజూ రవిని ఆరాధించాలి. అన్ని వర్ణాల వారు ఆదిత్య హృదయమును పఠించవచ్చు.


"శీతలా దేవి"  అన్ని రకాల విపత్తుల నుండి భూమిని కాపాడుతూ ఉంటుంది. ప్రతిరోజూ అందరూ రోజుకు రెండుసార్లు " శ్రీ శీతలా  దేవి స్తోత్రం" ను పారాయణం చేయాలి.  పఠించేవారిని వారి చుట్టూ ఉన్న పరిసరాలను ఈ తల్లి అన్ని ఆనారోగ్య విపత్తుల నుండి రక్షిస్తుంది.


అన్ని విపత్తులకు రక్షణ "శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం" ఇది చాలా మహిమా కలిగినది. శ్రీవిద్యా సాంప్రదాయంలో అగ్రగణ్యమైనది. దీనిని రోజు రెండు సార్లు చదువుతూ ఉంటే స్వీయ రక్షణ సంఘ రక్షణ రెండు జరిగుతాయి. అన్ని సమస్యల నుండి విపత్తుల నుండి తన భక్తులను నిరంతరం కాపాడుతూ ఉంటుంది.  అయితే లలిత సహస్రనామ స్తోత్రాన్ని గురు ముఖంగా నేర్చుకొని పారాయణం చేయాలి.  తప్పులు లేకుండా చదవాలి. ఎందుకంటే అతి నిగూఢమైన శ్రీవిద్యా రహస్యాలు. ఇందులో పొందుపర్చబడినవి.


ఇంకా శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ సుదర్శన మాహా స్తోత్రం, శ్రీ ఆంజనేయ బడబాలన స్తోత్రం, శ్రీ వారాహి స్తోత్రం, శ్రీ లక్ష్మి నృసింహ కరావలంబ స్తోత్రం మొదలగు స్తోత్రాలని ఎవరికి వీలైనవి వారు ఇంట్లో ఉండే చదివితే మంచి ప్రయోజనం ఉంటుంది.

"మహా మృత్యుంజయ మంత్రం, రుద్రం, మన్యు సూక్తం" వంటివి ఈ సమయాలలో చదవడం చాలా మంచిది. నవగ్రహ స్తోత్రం కూడా చాలా మంచిది.


ఈ సమయం లో "చండీ సప్తశతి" చాలా ముఖ్యం.  ఈ సంప్రదాయం లో ఉన్నవారు వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణం చేయడం మంచిది. చండీ దయ ఉంటే ఎటువంటి విపత్తు సంభవించదు. ప్రభుత్వం వారు కూడా దేవాలయాల్లో "చండీ హోమం"  ప్రతి రోజు చేయించడం మంచిది.  ఎక్కువ దేవాలయాలలో రోజు చేయించాలి.


ప్రతి రోజు "శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం" లేదా "దుర్గా స్తోత్రం" "కాళి స్తోత్రం" "కాళి కవచం" ఇంకా "శ్రీ దత్త పంజర స్తోత్రం" లేదా "శ్రీ దత్త సహస్రనామ స్తోత్రం" చదువుతూ ఉంటే అన్నీ విపత్తుల నుండి రక్షణ కలుగుతుంది.

ఇవే కాకుండా కుల దేవత ఆరాధన చేయడం మంచిది. ఇష్ట దేవత ఆరాధన కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.

పైన ఉదహరింపబడినవి ఎవరికి వీలైనవి వారు చదివి కరోన వైరస్ నుండి అందర్నీ రక్షించమని పరమాత్మని వేడుకుందాం.