Tuesday 29 December 2015

తీవ్ర ఆర్ధిక సమస్యలకు పరిహారాలు

తీవ్ర ఆర్ధిక సమస్యలకు పరిహారాలు


తీవ్ర ఆర్ధిక సమస్యలు మనిషిని క్రుంగదీస్తాయి. సమాజంలో ప్రతిష్ట మసకబారుతుంది. నేటి పోటి ప్రపంచంలోఎక్కువ మంది సరియైన ఉద్యోగం లేకనో, వ్యాపారాలలో తీవ్ర నష్టం వల్లనో లేదా ఇతర మానవ తప్పిదాలవలనో తీవ్ర ఆర్ధిక సమస్యలతో క్రుంగిపోతున్నారు. మానవ జీవితంలో వచ్చే ఇటువంటి ఆర్ధిక సమస్యలకు మన మహర్షులు ఎన్నో తరుణోపాయాలు సూచించారు. వీటిని మూఢ నమ్మకంగా కొట్టివేయకుండా సంపూర్ణ విశ్వాసంతో ఆచరిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్ధిక సమస్యల నుండి ఊరట లభిస్తుంది.

జాతక పరిశీలన ద్వారా ఆర్ధిక సమస్యలకు పరిహారాలు లభిస్తాయి. జాతకం లో ఏ గ్రహ సంయోగాల ద్వారా ఆర్ధిక సమస్యలు వస్తున్నాయో పరిశీలించి ఆయా గ్రహాలకు శాంతి పరిహారాలు పాటించుట ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. జాతకం కోసం పుట్టిన తేదీ, సమయం మొ|లగు వివరాలు తప్పనిసరి. కానీ ఈ వివరాలు లేనివాళ్ళుఇటువంటి పరిహారాలు పొందలేరు. అందుకని అన్నీ రకాల ప్రజల కోసం కొన్ని పరిహారాలను మన మహర్షులు సూచించారు. జాతకం ఉన్నవారు పుట్టినతేది వివరాలు లేనివాళ్లు కూడా ఈ పరిహారాలను పాటించవచ్చు.

ఆర్ధిక సమస్యలకు పరిహారాలు;

ప్రతి పౌర్ణిమ తిధి రోజు మహాలక్ష్మి ఆలయంలో సహస్రనామార్చన చేయిస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది,
ప్రతి మంగళ వారం శ్రీ ఆంజనేయ స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసి అర్చన చేయాలి.
41 రోజుల పాటు శ్రీ లలిత సహస్రనామావళి తో అమ్మవారికి కుంకుమార్చన చేయాలి.
21 రోజుల పాటు వరుసగా శ్రీ ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ జరిపించాలి.
41 రోజుల పాటు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా 11 సార్లు చదవాలి. అన్ని నియమాలు పాటించాలి.
90 రోజుల పాటు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి రోజు 108 ప్రదక్షిణలు చేసి అర్చన చేయాలి.
శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ మంగళవారం రాహు కాలంలో చేయాలి.
18 మంగళవారాలు లేదా శుక్రవారలందు దుర్గా ఆలయం లో రాహు కాలం దీపం వెలిగించాలి.
41 రోజుల పాటు గణపతిని గరిక తో అర్చించాలి.
11 శ్రావణ నక్షత్రమ్ రోజులందు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలు, పూలతో సహస్ర నామార్చన చేయించాలి.
5 స్వాతి నక్షత్రం రోజులలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికీ సహస్ర నామార్చన జరిపించాలి.
శ్రీలక్ష్మి సహస్రనావళి లేదా శ్రీ లలిత సహస్ర నామావళితో ఒక సం|రమ్ పాటు కుంకుమార్చన చేయాలి. అన్ని నియమాలను పాటించాలి.
ప్రతిరోజూ శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీసూక్తం పారాయణం చేస్తే ఆర్ధిక సమస్యలు క్రమంగా తగ్గిపోగలవు.
గణపతి ఆలయంలో 41 రోజుల పాటు ప్రతి రోజు 28 ప్రదక్షిణాలు చేసి గణపతి సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి. ఈ రోజులలో చవితి తిధి రోజున ఉపవాసం ఉంది గణపతికి ఉండ్రాళ్ళు మరియు ఇతర మధుర ఫలాలను నివేదిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
సర్పసూక్తంతో శివాలయంలో 21 రోజుల పాటు అభిషేకం చేయాలి.
11 సప్తాహాలు శ్రీ గురుచరిత్ర అన్ని నియమాలతో పారాయణం చేసి అనంతరం ఏదైనా దత్త క్షేత్రాలలోతీరిపోగలవు
5 లేదా 11 లేదా 15 లేదా 21 లేదా 25 లేదా 27 సంఖ్యలో బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే ఎటువంటి ధన ఉద్యోగ సమస్యలైన తీరిపోగలవు
గురుముఖంగా లక్ష్మి, లలిత. దత్త విష్ణు శివ మంత్రాలను తీసుకొని ప్రతిరోజూ క్రమం తప్పకుండ జపం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి
సంధ్యావందనం అర్హత ఉన్నవారు తప్పనిసరిగా ప్రతిరోజూ సంధ్యా వందనం ఆచరించాలి. సంధ్యావందనం చేయకుండా ఏ దేవతను ఆరాధించిన ప్రయోజనం ఉండదు. సంధ్యావందనం తో సకల అరిష్టాలు తొలగిపోగలవు.
చండీ సప్తశతి పారాయణం ప్రతిరోజూ పారాయణం చేస్తే అన్ని సమస్యలు తీరిపోగలవు.
7 సప్తాహాలు షిర్డి సాయి చరిత్ర పారాయణం చేసి శిరిడీ ని దర్శించి ధుని లో కొబ్బరికాయను సమర్పించి 11 మంది పేదవారికి అన్నదానం చేస్తే ఆర్ధిక ఆరోగ్య సమస్యలు తీరిపోగలవు.
వాల్మీకి రామాయణం లోని సుందరకాండను ప్రతిరోజూ పారాయణం చేస్తే అన్నీ శుభాలు కలుగుతాయి.

పైన ఉదహరింపబడిన పరిహారాలు ఎవ్వరైన పాటించవచ్చు. పై వాటిలో ఎవరికి అనుకూలమైన పరిహారం వారు చేయవచ్చు. అన్ని పాటించనవసరం లేదు.


సూర్యదేవర వేణుగోపాల్ , H-No- 1-879  సుందరయ్య నగర్
మధిర ఖమ్మం జిల్లా   తెలంగాణ
venusuryadevara@gmail.com


Saturday 19 December 2015

వాస్తు విజ్ఞానం 6&7
బావి ఈశాన్యంలో, ఉపగృహం నైరుతిలో ఎందుకుండాలి?
                              సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)



దిక్కులను యే విధంగా ఉపయోగించుకోవాలో మనం పరిశీలిద్దాం. అన్ని దిక్కులు ఉపయోగకరమైనవే. ఏ దిక్కుకు ఉండే లాభ నష్టాలు ఆ దిక్కుకు ఉంటాయి. మానవ మనుగడకు దిక్కులను సమతౌల్యం చేసి వినియోగించుకోవాలి. సుఖ శాంతులను ప్రసాదించే దిక్కుల బలాన్ని పెంచి, నష్టాలను ఇచ్చే దిక్కుల బలాన్ని తగ్గించడం ద్వారా మంచి జీవితాన్ని పొందవచ్చు అనే విషయాన్ని మనం గత అధ్యాయాలలో తెలుసుకొన్నాం. దిక్పతుల బలం, నవగ్రహ బలం మనపై ఉంటుంది. దిక్పతుల, నవగ్రహాల లక్షణాలను అనుసరించి దిక్కుల బలాబలాలను సమతౌల్యం చేయాలి..దిక్పతుల బలాన్ని యే విధంగా పెంచాలి లేదా తగ్గించాలి అన్నది వాస్తులో చాలా ముఖ్యమైన విషయం. ఈ పరిజ్ఞానం తప్పనిసరిగా వాస్తు పండితునికి ఉండాలి. ముందుగా దిక్పతి బలాన్ని యే విధంగా పెంచాలో తెలుసుకొందాం. మనకు యే దిక్పతి బలం అవసరమో ఆ దిక్కును బాగా పల్లం చేయాలి. అదే విధంగా విశాలంగా బరువులు వేయకుండా ఉంచాలి. అప్పుడే ఆ దిక్పతి బలం పెరిగి అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. అదేవిధంగా ఏ దిక్పతి బలం మనకు నష్టం కలిగిస్తుందో లేదా ఏ దిక్పతి బలహీనంగా ఉంటే లాభిస్తుందో, ఆ దిక్కును బాగా మెరకలో అంటే ఎత్తులో ఉంచి బరువులను వేయాలి. అదే విధంగా ఆ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం వదలాలి. అప్పుడే ఆ దిక్కు బలం తగ్గి మంచి లాభాలను కలిగిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే పల్లమైన దిశ అధిబలం కలిగి ఉంటుంది. మెరకలో ఉన్న దిశ బలహీన మౌతుంది.


తూర్పు, ఉత్తరం మరియు ఈశాన్య దిక్కులు శుభాలను ప్రసాదించే గ్రహాల మరియు దిక్పతుల ఆధీనంలో ఉంటున్నాయి. అదే విధంగా దక్షిణ, పశ్చిమ,నైరుతి,వాయవ్య మరియు ఆగ్నేయ దిశలు అశుభాలను ప్రసాదించే గ్రహాల మరియు దిక్పతుల ఆధీనంలో ఉంటున్నాయి. సుఖప్రదమైన జీవితానికి శుభాలను ప్రసాదించే తూర్పు,ఉత్తర మరియు ఈశాన్య దిక్కుల బలం పెరగాలి. అదేవిధంగా అశుభాలను ప్రసాదించే దక్షిణ,పశ్చిమ ,నైరుతి మొదలగు దిశల బలం తగ్గాలి. అప్పుడే దిక్కుల మధ్య సమతౌల్య స్థితి ఉండి మనిషి మనుగడ సుఖప్రదంగా సాగుతుంది. మంచి జీవితం కోసం శుభాలను కలిగించే తూర్పు ఉత్తర మరియు ఈశాన్య దిక్కుల బలం పెరగాలి కాబట్టి ఈ దిక్కులను పల్లంగాఉంచి బరువులు వేయకుండా విశాలంగా ఎక్కువ ఖాళీగా ఉంచాలని వాస్తు ఆదేశిస్తుంది. అదేవిధంగా మిగిలిన దిక్కులు కష్టాలను నష్టాలను ఇస్తాయి కాబట్టి ఈ దిక్కుల బలం తగ్గాలి కనుక తక్కువ ఖాళీ స్థలం వదలి బరువులు పెట్టి  మెరకలో ఉంచాలని వాస్తు తెలుపుతుంది. ఈ విధంగా చేస్తే మనిషి జీవితం సుఖప్రదంగా ఉంటుంది.


పై సూత్రం ప్రాతిపదిక పైనే మనం ఈశాన్యం లో జలాశయాలు, బోర్ వెల్స్ మరియు బావులను త్రవ్వుతున్నాము. బావి, బోర్లు ఈశాన్యంలో ఉండుటవలన అవి బాగా పల్లంగా లోతుగా ఉండటం వల్ల ఈశాన్యం బలం పెరిగి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదే విధంగా తూర్పు ఉత్తరంలలో ఉన్నప్పటికి ఈ దిక్కుల బలం పెరిగి సుఖశాంతులు కలుగుతాయి. ఈ దిక్కుల బలం మానవ మనుగడకు తప్పనిసరిగా అవసరం కాబట్టి ఈ దిక్కులందే బావులను, జలాశయాలను ఉంచాలని వాస్తు చెపుతుంది. అంతేకాని గ్రుడ్డిగా కారణం లేకుండా వాస్తు చెప్పలేదు. ఈ దిక్కులందు బాగా పల్లం ఉంటే గృహస్తుకు అన్ని విషయాలలో యోగిస్తుంది. అన్నివిధాల అభివృద్ది ఉంటుంది. ఈ క్రింది శ్లోకం గమనించండి......

 పూర్వప్లవా ధరా శ్రేష్టా ఆయు: శ్రీ బలవర్ధినీ
సర్వసంపత్కరీ పుంసాం ప్రాసాదానామ్ విభూతిధా
పూజ్యా లాభకరీ నిత్యం పుత్ర పౌత్ర వివర్ధినీ
కామదా భోగదా చైవ ధనదాచోత్తర  ప్లవా ---                                                               
వరసౌఖ్య సతీ సత్య సౌభాగ్యాది వివర్ధిని.                    
ధనా:ఐశ్వర్య సంపన్న ధర్మ ఈశానక ప్లవా----" అపరాజితపృచ్చ"                                              


పై శ్లోకం "అపరాజితపృచ్చ" అనే ప్రాచీన వాస్తు గ్రంధం లోనిది. తూర్పు పల్లంగా ఉంటే ఆయుషు, ధనం తో పాటు అన్ని శుభాలు కలుగుతాయి, ఉత్తరం పల్లంగా ఉంటే ధనధాన్య వృద్ది ఇంకా వంశ వృద్ది ఉంటుంది. అదేవిధంగా ఈశాన్యం పల్లంగా ఉంటే సతీ సౌఖ్యం, ధనం, ఐశ్వర్యం సమకూరగలవు అని పై శ్లోకం చెపుతుంది. కనుక సకల శుభాలను కలిగించే ఈ దిక్కులను కావలసినంత మేరకు విశాలంగా పల్లంగా ఉంచితే, ఈ దిక్కులకు ఆధిపత్యం వహిస్తున్న దిక్పతుల,  గ్రహాల ఆశీర్వాదం వల్ల మానవ మనుగడ సుఖప్రదం అవుతుంది. కనుక అత్యంత పల్లం కలిగిన బోర్లు, నూతులు ఇంకా జలాశయాలు ఈ దిక్కులలోనే ఉంచాలి.అప్పుడే ఈ దిక్కులు శక్తివంతంగా మారి శుభాలను ప్రసాదిస్తాయి కాబట్టే మన ప్రాచీన వాస్తు గ్రంధాలు ఈ దిక్కులను పల్లంగా ఉంచాలని చెపుతున్నాయి. ఈ దిశలందు పల్లం ఉంటే ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని అనుభవంద్వారా కనుగొని మన మహర్షులు తెలియ జేశారు.


అశుభాలను ప్రసాదించే దిక్కుల బలాన్ని సుఖప్రదమైన జీవితం కోసం తగ్గించాలి. కనుక ఈ దిక్కులను మెరక చేసి, బరువులను ఉంచి తక్కువ ఖాళీ స్థలం వదలాలి. దక్షిణ,పశ్చిమ,నైరుతి, ఆగ్నేయ,మరియు వాయవ్య దిశలను మెరక చేసి బరువులను ఉంచడం ద్వారా ఈ దిక్పతులను, గ్రహాలను బలహీనం చేయాలి. అప్పుడే సమస్యలు తగ్గిపోగలవు. ఈ దిశలు పల్లం అయితే ఈ దిక్పతుల బలం పెరిగి తీవ్ర నష్టాలు వస్తాయి. మన ప్రాచీన వాస్తు గ్రంధాలు ఈ విషయాన్నే చెప్పడం జరిగింది. ఈ దిక్పతులను పల్లం చేయడం ద్వారా ఈ దిక్కుల బలాన్ని పెంచితే ఎటువంటి దుష్ట ఫలితాలు కలుగుతాయో " అపరాజితపృచ్చ" అనే ప్రాచీన వాస్తు గ్రంధం తెలిపింది. ఈ శ్లోకం గమనించండి.....
                                 
                                  నశ్యన్తి పురుషాస్తత్ర దేవతాచ ప్రణశ్యతి
                             ధన హానింకరో నిత్యం రోగకృత్ దక్షిణ ప్లవ:    
                             ప్రవర్తయే గృహే పుంసాం రోగాశ్చ మృత్యుదాయకాన్
                             ధనహానిమ్ తధా నిత్యం కురుతే నైరుతి ప్లవా.                                                      
                                    పశ్చ్హిమే చ ప్లవా భూమి ధనధాన్య వినాశిని
                             శోకదాహ్యామ్ కులం తత్ర యత్ర భూ:పశ్చ్హిమే ప్లవా.  
                             ఆగ్నేయ ప్లవకా భూమి అగ్నిదాహ భయావహా
                             శత్రు సంతాపదా నిత్యం కలి దోషోగ్ని ప్లవ: స్మృత: 
                             శతృకర్త్రీ విరాగీ చ గోత్ర క్షయకరీ తధా
                             గృహే చ కన్యకానాం హంత్రీ సదా దు:ఖ భయవహా.
                                                                             అపరాజితపృచ్చ


పై శ్లోకం ప్రకారం దక్షిణం పల్లమైతే ధననష్టం, రోగభయం. ఇటువంటి స్థలంలో దేవుడు కూడా రాణించడు. నైరుతి పల్లం అయితే సదా రోగ భయం, ప్రవర్తన దోషాలు, ధన హాని ఇంకా మృత్యు భయం. పడమర పల్లం ధన ధాన్యాలను నాశనం చేస్తుంది. ఇంకా ఆగ్నేయ పల్లం వలన అగ్నిభయం, శత్రువృద్ది ఉంటుంది. వాయవ్య పల్లం స్త్రీలకు నష్టం కలిగిస్తుంది. ఇంకా సదా దుఖాన్ని కలిగిస్తుంది. పై శ్లోకం అర్ధం ఇదే.  ఈ దిశలందు పల్లం అయితే ఈ దిక్కుల బలం పెరిగి మానవునికి తీవ్ర నష్టాలు వస్తాయి. కనుక వీటిని మెరకలో ఉంచి తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లుగా చేసి బరువులు వేయడం ద్వారా వీటి బలాన్ని తగ్గిస్తే మనిషి జీవితం బాగుంటుంది. అత్యంత పల్లం ఉండే బావులు, బోర్లు, జలాశయాలు ఈ దిక్కులలో ఉంచితే వీటి బలం విపరీతంగా పెరిగి తీవ్ర నష్టాలు వస్తాయి. అందువల్లే ఈ దిక్కులందు నూతులు, బోర్లు, జలాశయాలు ఉండరాదని వాస్తు తెలియజేస్తుంది.ఈ దిక్కుయందు ఉపగృహాలు నిర్మిస్తే ఈ దిక్కుల బలం తగ్గి సమస్యలు తగ్గుతాయి. అయితే బావులు పడమర వాయవ్యంలో ఉండటం పాత ఇండ్లలో మనం నేటికీ చూస్తాము. ఈ దిక్కు చంద్రుని ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి బావులు ఉండవచ్చుననే అభిప్రాయం ఉంది. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికి ఈ దిక్కు లో బావులు ఉండుట వలన ఆర్ధిక అభివృద్ది లోపిస్తుంది. స్త్రీలకు ఇంకా పురుషలకు కూడా ఆరోగ్యం సరిగా ఉండకపోవచ్చు. ఈ దిశ పల్లం అయితే వాయు మరియు చంద్రుని బలం పెరిగుతుంది. ఈ బలం వ్యవసాయానికి మరియు పశువుల అభివృద్దికి తోడ్పడుతుంది. పూర్వకాలంలో మానవుని ప్రధానమైన ఆర్ధిక వనరు ఇవే కాబట్టి వారికి లాభించి ఉండవచ్చు. అయితే నేటి కాలంలో ఇది లాభించదు. కాబట్టి ఇక్కడ బావులు ఉండకూడదు. కనుక నష్టాలను లేదా అశుభాలను కలిగించే దిక్కులను బలహీనపర్చుట ద్వారా మంచి జీవితాన్ని పొందవచ్చు. ఈ దిక్కులు కూడా మంచివే. కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాలలో వీటి బలం కూడా మనిషికి అవసరం అవుతుంది. కనుక వీటిని జాగ్రత్తగా కావలసినంత మేరకే వినియోగించుకొంటే సర్వోతోముఖాభివృద్ది ప్రాప్తిస్తుంది.


మానవుని సుఖజీవితం కోసం శుభాలను కలిగించే తూర్పు, ఉత్తర,ఈశాన్య దిక్కులకు బలం పెంచడానికే అత్యంత లోతుగా, పల్లంగా ఉండే నూతులు, బోర్లు, జలాశయాలు ఈ దిక్కులందు ఉండాలని వాస్తు ఆదేశిస్తుంది. అశుభాలను, నష్టాలను కలిగించే దక్షిణ,పశ్చిమ, నైరుతి,ఆగ్నేయ మరియు వాయవ్య దిశల బలం తగ్గించడం కోసం ఈ దిక్కులందు బావులను బోర్లను ఉంచకుండా, మెరకజేసి బరువులను ఇంకా ఉపగృహాలను నిర్మించమని వాస్తు తెలియజేస్తుంది. ప్రకృతి నుండి లాభాలను పొందడానికే వాస్తు ఈ విధమైన సూత్రాలను అందించింది. అంతే కాని వాస్తు సూత్రాలు మూఢంగా కారణం లేకుండా రూపొందించబడినవి కావు. ఇందులో ఎంతో విజ్ఞానం ఇమిడివుంది. ఈ సూత్రాలన్నీ మానవ శ్రేయస్సుకోసం ఉద్దేశింపబడినవే.
                                                            సూర్యదేవర వేణుగోపాల్


సూర్యదేవర వేణుగోపాల్. M.A(జ్యోతీష్యం), H.NO-1-879, సుందరయ్య నగర్
  మధిర,   ఖమ్మం జిల్లా తెలంగాణ

Saturday 12 December 2015

ధ్యానం అంటే సహజత్వానికి చేరడమే.


ధ్యానం అంటే మనకు ఉండే సహజ స్థితికి మనం చేరడమే. దివ్యమైన చైతన్య స్థితే మన సహజ స్థితి. ధ్యానం యొక్క గమ్యం కూడా అదే. ఆ సహజస్థితి లో  వుండడమే నిజమైన ధ్యానం. సహజస్థితిని పొందడానికి కేంద్రీకృతం  కావడం ముఖ్యం. ధ్యాని తనకు తానుగా కెంద్రీకృతం కాబడి ధ్యానబిందువు గా మారాలి. ఇదే సహజత్వాన్ని పొందటానికి రహదారి. కేంద్ర బిందువు లో మౌనంగా స్థిరపడినప్పుడు మాత్రమే మన సహజస్థితి అనుభవం లోనికి వస్తుంది. అప్పుడే  జ్ణానం సంప్రాప్తమౌతుంది. ఈ కేంద్ర బిందువుకి చేరాలంటే నిరంతర సాధన, ధ్యానాన్ని గురించిన సరియైన అవగాహన ముఖ్యం.
ధ్యానం గంభీరంగా చేసేది కాదు. ధ్యానం గంభీరతను కోరదు. ధ్యానం అంటే మనకున్న సహజత్వాన్ని పొందడమే కదా. దీనికి అంత భయంకర నియమాలు , కటినమైన గంభీరత అవసరం లేదు. మన సహజ స్థితిని మనం ఇప్పటికే పొందివున్నాం. కనుక మనం చేయవలసిందల్లా ఆ బిందువుకు చేరడమే. మనస్సు తో చేసే ఏకాగ్రతా ధ్యానం పరమ గమ్యాన్ని చేర్చలేదు. ధ్యానం అంటే ఏకాగ్రత కాదు. ధ్యానం అంటే మనస్సుకు అతీతమైన స్థితి. విపరీతంగా చేసే ఏకాగ్రత  మనోతీత స్థితికి చేర్చలేదు. కనుక మనస్సుకు అతీతంగా ధ్యానాన్ని ఆచరించాలి. ఈ ప్రయత్నం  ఆలోచనరహిత స్థితిని ప్రసాదిస్తుంది. ఈ ఆలోచన రహిత  స్థితి మనిషిని తన కేంద్ర బిందువుకి చేర్చుతుంది. ఆలోచనలు పూర్తిగా లుప్తం అయినప్పుడే మనోతీత స్థితి లభ్యం అవుతుంది. మనోతీత మైన స్థితి గతం గురించిన ఆలోచలననుండి, భవిష్యత్ గురించిన చింతల నుండి దూరం చేసి  మనిషిని ఎల్లప్పుడు వర్తమానం లో కి సంచరింపజేస్తుంది. ఇదేయే నిజమైన ధ్యానం..  కనుక నిజమైన ధ్యానానికి మనస్సు దాని నుండి ఉద్భవించే ఆలోచనలు పూర్తిగా నశించాలి.
ఆలోచనలు లుప్తం కావాలంటే యేమి చేయాలి?  ఆలోచనలు నశించాలంటే మనం ఒక ప్రేక్షకునిలా మారి ఆలోచనలను గమనించాలి. ఆలోచనలకు కేవలం సాక్షి లా మారాలి. మనస్సును దాని నుండి జన్మించే ఆలోచనలను ,పరిసరాలను,ఇంకా మన ప్రతి కదలికను కేవలం ఒక సాక్షిగా మారి మన లోపలి నుండి పరిశీలించాలి. ఇటువంటి గమనిక అత్యంత శాంతి ని ప్రసాదిస్తుంది. నిరంతరం అన్నీ విషయాల పట్ల సాక్షిగా వుండటమే ధ్యానం యొక్క పరమార్ధం. ఈ విధమైన సాక్షి సాధన కేవలం అభ్యాస ,వైరాగ్యాల ద్వారా మరియు సరియైన అవగాహన ద్వారానే సాధ్యం కాగలదు.ఒక్కసారి మనం మన సహజత్వాన్ని పొందితే నిజమైన ఆనందం తేటతెల్లం అవుతుంది.మనోభ్రాంతి, ఇంకా చెప్పాలంటే సకల మాలిన్యాలు మట్టికలసి పోతాయి.ఇదేయే నిజమైన జ్ణాని, అవధూత, లేదా శ్రీకృష్ణ స్థితి.
ఈ విధమైన ధ్యానానికి గంటల తరబడి కూర్చోనవసరం లేదు. మనం మన దైనందిన భాద్యతలను నిర్వర్తిస్తూ కొంచం జాగురుకతతో మరికొంచెం స్పృహ తో వుంటే చాలు. ధ్యానం కోసం ఏకాంత ప్రదేశాలకు పోనవసరం లేదు. మన ప్రతి క్రియను జాగరూకతతో మన కేంద్రం నుండి నిర్వర్తించాలి. అప్పుడు  జీవితమే ధ్యానం గా  మారుతుంది. తదుపరి అన్ని విషయాల పట్ల నిస్సంగత్వమ్ అలవడి గీత లో కృష్ణ పరమాత్మ బొధించినట్లుగా తామరాకు మీద నీటి బిందువులా జీవితం మారిపోతుంది. ఇదియే బుద్దుని స్థితి.

ఆలోచనలు ,పరిసరాలు ధ్యానాన్ని ఎప్పుడూ భంగ పరుస్తూనే వుంటాయి. ఆలోచనలను అదిమిపెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. అలాగే పరిసరాల నుండి పారిపోకూడదు. ఈ విధమైన ప్రయత్నాలన్నీ ఘర్షణలను సృస్టిస్తాయి. ఆలోచనలను పరిసరాలను ధ్యాని స్వీకరించాలి.  వీటిని అంగీకరిస్తూనే  విలువ ఎంతమాత్రం ఇవ్వరాదు. సాగిపోయే అలలు లాగా పరిశీలించాలి. ఎప్పుడైతె ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వమో  అప్పుడే అవి నశిస్తాయి. ఈ రహస్యాన్ని తెలుసుకొని ధ్యానాన్ని ఆచరించాలి. ఇదియే సహజ స్థితి ని పొందడానికి సులభమైన మార్గం. మనస్సుతో మరియు, ఆలోచన్లతోపాటుగా ధ్యాని ప్రయాణం చేయకూడదు. వాటిని జాగురూకతతో పరిశీలించాలి. ఈ ఆలోచనలు మనిషి యొక్క సహజత్వాన్ని భంగపరచలేవు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి.ఇదియే నిజమైన ధ్యానం.
                                                          
                                                                                             
   

  venusuryadevara@gmail.com

Monday 7 December 2015

               స్థలఎంపికలో- వాస్తు జాగ్రత్తలు
                                                                                      సూర్యదేవర వేణుగోపాల్

గృహ నిర్మాణానికి  స్థల నిర్ణయం చాలా ముఖ్యమైనది. అన్ని స్థలాలు నిర్మాణానికి పనికి రావు. స్థల ఎంపికలో వాస్తును ఖచ్చితంగా పాటించాలి. మన పూర్వ వాస్తుగ్రంధాలు ఈ స్థల ఎంపికపై చాలా సూచనలు చేశాయి. ఈ సూచనలను నేటి కాలంలో యధాతధంగా, పూర్తిగా మనము పాటించలేకపోయినప్పటికి,కొన్ని ముఖ్యమైన వాటిని తప్పనిసరిగా పాటించాలి. కనుక ఈ సూచనలను స్థలాలు కొనే సందర్భంలో తప్పనిసరిగా ప్రతీవ్యక్తి గుర్తుంచుకోవాలి.
తూర్పు ఉత్తరం మరియు ఈశాన్య దిక్కులలో తొలగించడానికి వీలు లేని ఎత్తైన కట్టడాలు గాని కొండలు ,గుట్టలు గాని ఉన్న స్థలాలను తీసుకోకూడదు. ఇటువంటి ప్రదేశాలలో నివశిస్తే అభివృద్ది కుంటుబడుతుంది. తూర్పులో ఎత్తైన గుట్టలు ,కొండలు ఉంటే ఆ ప్రదేశం లో మగవారికి అభివృద్ది ఉండదు. ఇటువంటి స్థలాలలో పరిశ్రమలు ఉంటే వాటి మనుగడ సామాన్యం గా ఉంటుంది.ముఖ్యంగా వ్యాపారాలకు ఉత్తరము మరియు ఈశాన్యము తేలికగా పల్లం గా ఉండాలి. ఈ దిక్కులందు పైన ఉదహరించినట్లు గుట్టలు, బరువైన నిర్మాణాలు ఉంటే వ్యాపారము రాణించదు.స్థలాలను ఎంపిక చేసే సమయములో ఈ జాగ్రత్తను తప్పనిసరిగా పాటించాలి. ఈ దిక్కులలో ఉన్న బరువులను తొలగించడానికి వీలుగా ఉంటే స్థలమును తీసుకోవచ్చు. నిర్మాణానికి ముందే వీటిని తొలగించాలి.అప్పుడే నిర్మాణం సకాలంలో పూర్తి అవుతుంది.
తీసుకొనే స్థలానికి దక్షిణ పడమర దిక్కులలో నదులు గాని, ఎక్కువ విస్తీర్ణము కలిగిన నీటి ప్రవాహములు గాని, బావులుగానీ ఉండగూడదు. వీటివల్ల చాలా నష్టాలు వస్తాయి. ఈ స్థలాలలో తీవ్ర ఆర్ధిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అదేవిధంగా సవరించడానికి వీలులేనంతగా గుంటలు గాని లేదా పల్లంగాని ఈదిక్కులలో ఉంటే ఇటువంటి స్థలాలను వదిలివేయడం మంచిది. పరిశ్రమలకైతే ఇటువంటి స్థలాలు మంచివికావు. ఇటువంటే ప్రదేశాలలో కట్టే పరిశ్రమలు సిక్ పరిశ్రమలుగా మారతాయి.

 నైరుతి, ఆగ్నేయం పల్లంగా ఉండగూడదు. ఈ దిక్కులలో పల్లం ఉంటే అక్కడ కట్టే పరిశ్రమలు, పెట్టె వ్యాపారాలు దెబ్బతింటాయి.
దక్షిణ పడమర మరియు నైరుతి దిశలందు ఎత్తైన గుట్టలు గాని, నిర్మాణాలు గాని ఉంటే అటువంటి స్థలాలు మంచివి.ఇటువంటి స్థలాలలో పరిశ్రమలు  గాని వ్యాపారాలు గాని ఇంకా గృహాలు గాని బాగా రాణిస్తాయి. ఇటువంటి స్థలాలకు  తూర్పు ఉత్తర ఈశాన్య దిక్కులలో నీటి ప్రవాహాలు గాని నదులు గాని ఉంటే ఈ స్థలం లక్ష్మీమయం అవుతుంది. ఎటువంటి నిర్మాణాలైన బాగా రాణిస్తాయి. స్థలానికి ఉత్తరం తూర్పు బాగా పల్లం గా ఉంటే చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే అన్నీ దిశల కన్నా ఉత్తరం పల్లం గా ఉంటే మంచి ఆర్ధిక పుష్టి, అభివృద్ది ఉంటుంది. ఈ దిశలందు నీటి ప్రవాహాలు నదులు మొ| నవి ఉంటే  ఇంకా మంచిది .
ఇక వీధి శూలలు గురించి బాగా గమనించాలి. స్థలాలను కొనే ముందే ఈ వీధిశూలలను పరిశీలించాలి..దక్షిణం పడమర ల వీధి శూలలు ఉన్న ప్రదేశాలు మంచివికావు. నైరుతి, తూర్పు ఆగ్నేయంమరియు ఉత్తరవాయవ్యం నుండి వీధి శూల ఉంటే అటువంటి స్థలాలను తీసుకోకూడదు. అయితే వీధి శూల పడే మేరకు స్థలాన్ని వేరు చేసి మిగిలిన స్థలం లో నిర్మాణం చేసే వీలు ఉంటే స్థలాన్ని తీసుకోవచ్చు. Mainroad మరియు మంచి మార్కెట్ ఏరియా లో ఇటువంటి స్థలం ఉంటే  స్థలం తీసుకొని వీధిశూలకు వాస్తు లో చెప్పిన పరిహారాలను ఉపాయాలను పాటించవచ్చు. ఈశాన్య పశ్చిమ వాయవ్య,మరియు దక్షిణ ఆగ్నేయ దిశల నుండి వీధి చూపులున్న స్థలాలు మంచివే. తూర్పు ఉత్తర వీధి చూపులు కూడా మంచివే.. వీటిని కొనవచ్చు.అయితే కేవలం తూర్పు ఉత్తరం వీధిచూపులుంటే వాస్తు పండితుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.వ్యాపారాలకు పరిశ్రమలకు  దక్షిణ ఆగ్నేయ మరియు ఉత్తర ఈశాన్య వీధి చూపులుచాలా మంచివి.స్థలాలను కొనే ముందు వీధి శూలలను బాగా గమనించి కొనాలి.
నూతన స్థలాలను కొనే ముందు దేవాలయాల విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలి. శిఖరం నీడ, ధ్వజ స్తంభం నీడ పడే స్థలాలను కొనకూడదు.ఈ నీడలు వల్ల జీవితాలు అభివృద్దిని కోల్పోతాయి. అనేక ఆర్ధిక,ఆరోగ్య ఇతర సమస్యలు దేవాలయ, ధ్వజస్తంభ నీడలవల్ల కలుగుతాయి. ఇంకా విష్ణు ఆలయాలకు వెనుక వైపు, శివాలయాలకు ఎదురుగా మరియు శక్తి ఆలయాలకు పార్శ్వ భాగం లోఅంటే ప్రక్క భాగంలో  ఇల్లు గాని స్థలాలు గాని ఉండకూడదు.నవగ్రహాలలో శని అత్యంత బలవంతుడు.ఈ శనీశ్వరుని వీక్షణ ఉన్న స్థలంలో నిర్మాణాలు మంచివి కావు. కనుక ఇటువంటి స్థలాలను వదలివేయుట మంచిది. అదేవిధంగా జాతరలు జరిగే స్థలాలు కూడా మంచివి కావు.
శ్మశానాలకు దగ్గరగా ఉన్న స్థలాలు మంచివి కావు. శ్మశానాలకు అనుకోని ఉన్న స్థలాలను కొనకూడదు.ఇంకా కొలిమి పెట్టిన స్థలాలు, సున్నం గానుగా పెట్టిన స్థలాలు మంచివి కావని ఋషి వాక్కు.అదేవిధంగా పిడుగు పడిన స్థలాలను కూడా వదిలివేయాలని మన పూర్వీకులు సూచించారు. త్రికోణ ఆకారం కలిగిన స్థలాలు మంచివికావు. అయితే ఈ స్థలాలను వాస్తుకు అనుగుణంగా మార్చుకోగలిగితే తీసుకోవచ్చు. తటాకాలను పూడ్చి నేడు నిర్మాణాలు చేస్తున్నారు. ఇటువంటి స్థలాలు కూడా అంతగా కలసి రావు. స్థలానికి నీటి ప్రవాహపు పోటు మంచిది కాదు. స్థలానికి ఎదురుగా నీటిప్రవాహపు పోటు ఉంటే ఆ స్థలాన్ని వదిలివేయుట మంచిది.
నైరుతి దిక్కున సవరించడానికి వీలు లేని బావులు గాని, నీటి ప్రవాహం గాని పల్లమైన స్థలం గాని ఉంటే అవి మృత్యుదేవతకు నివాసంగా మారతాయి.కనుక అటువంటి స్థలాలను వదలివేయాలి. ఇటువంటి దోషాలు వాయవ్యం మరియు ఆగ్నేయంలోఉన్నాకూడా అటువంటి స్థలాలను వదలివేయుట మంచిది. మృత్తిక రుచి,రంగు పై ఆధారపడి మన పూర్వీకులు కొన్ని వాస్తు సూచనలు చేశారు. కానీ వాటిని ఇప్పటి కాలంలో అనుసరించలేము.
ఊరి బయట స్థలాలను తీసుకొన్నప్పడు తప్పనిసరిగా దాని పూర్వస్థితిని  గమనించాలి. ఇటువంటి స్థలాలలో గృహాన్ని నిర్మించేటప్పుడు తప్పనిసరిగా అడుగు లేదా రెండు అడుగుల మందం పై భూమిని తొలగించి గృహాన్ని నిర్మించాలి. పరిశ్రమలకోసం స్థలాన్ని తీసుకొనే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థలం యొక్క నైసర్గిక వాస్తును తప్పనిసరిగా పరిశీలించాలి. లేకపోతే పరిశ్రమలు తీవ్ర నష్టాలపాలు అవుతాయి.వ్యాపారాలకు గాని పరిశ్రమలకు గాని తప్పనిసరిగా ఉత్తరం మరియు ఈశాన్యం పల్లంగా ఉండాలి. దక్షిణ పడమర మరియు నైరుతి దిక్కులందు ఎత్తైయన గుట్టలుగాని,కట్టడాలు గాని ఉంటే ఆ పరిశ్రమలు, వ్యాపారాలు బాగా రాణిస్తాయి.
అన్నీ స్థలాలు అందరికీ కలసి రావు. కొన్ని దిక్కులు కొందరికే సరిపడతాయి. కనుక స్థలాన్ని కొనే ముందు మంచి వాస్తు పండితుడి సలహా తీసుకోవాలి. వర్గు పద్దతిని తప్పనిసరిగా పాటించాలి. నేటి కాలంలో ఈ వర్గు విధానాన్ని విస్మరిస్తున్నారు. కానీ దీనిని పరిగణలోకి తీసుకొంటే మంచి ఫలితాలు వస్తాయి. వర్గును విస్మరించడం తప్పు. నేటి నవీన వాస్తుకు మన ప్రాచీన గ్రంధాలలో చెప్పిన కొన్ని మంచి విషయాలను అన్వయించితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. కనుక వర్గు ను సాధ్యమైనంత మేరకు ఉపయోగించుకొంటె మంచి ఫలితాలు వస్తాయి. వర్గును నేటి పరిస్థితులకు తగినట్లుగా  యే విధంగా మలుచుకోవాలి అనే విషయాన్ని తదుపరి వ్యాసాలలో వివరిస్తాను. స్థలం కొనే ముందే వర్గు విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. అదే విధంగా మన నామ నక్షత్ర ప్రాతిపదికపై స్థల నిర్ణయం చేయడం మంచిది. కొందరు జన్మ నక్షత్రం ను ఆధారం గా తీసుకొని స్థలాలను నిర్ణయిస్తున్నారు.ఇది తప్పుకాకపోయినప్పటికి స్థలాలు గృహాలు వ్యాపారాలు నిర్ణయించే సమయంలో నామ నక్షత్రం పై ఆధార పడితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ క్రింది శ్లోకం గమనించండి---
దేశే,గ్రామే,గృహే,యుద్ధే సేనయా వ్యవహారికే
నామరాశే: ప్రధానత్వం జన్మరాశి న చింతయేత్
“జ్యోతిర్నిబంధం”
స్థలాలను ఎంపిక చేసే సమయం లో పైన ఉదహరింపబడిన సూచనలను పాటిస్తే  సుఖప్రదమైన జీవితం మరియు సర్వతోముఖాభివృద్ది లభిస్తుంది.

సూర్యదేవర వేణుగోపాల్ M. A జ్యోతిష్యం

H.NO—1-879   సుందరయ్య నగర్       మధిర  ఖమ్మం జిల్లా  తెలంగాణా

Saturday 5 December 2015

తూర్పు ఉత్తరాలలో ఎక్కువ ఖాళీ ఎందుకు వదలాలి?
                                                          సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)
అన్ని దిక్కులు ఒకే విధమైన ఫలితాలు ఇవ్వవు. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. గృహాన్ని నిర్మించే సందర్భంలో మంచిని కలిగించే దిక్కుల బలాన్ని పెంచి చెడును కలిగించే దిక్కుల ప్రభావంను తగ్గించుట ద్వారా సుఖజీవితాన్ని పొందవచ్చు. కాని ఈ సందర్భంలో కొన్ని దిక్కులు మంచిని ఎందుకు ప్రసాదిస్తున్నాయి మరికొన్ని దిక్కులు చెడును మాత్రమే ఎందుకు ఇస్తాయి అన్న ప్రశ్న వస్తుంది. దిక్కులకు మంచి చెడులు దిక్కులకు ఆధిపత్యం వహిస్తున్న అధిపతులకు గల లక్షణాల పై ఆధారపడి వస్తాయి. అధిపతుల లక్షణాలనే మనం మంచి చెడు గా వర్గీకరిస్తున్నాము. వాస్తు, జ్యోతిష్యం లోని సంహిత విభాగానికి చెందినది. దిక్కులకు నవగ్రహాలకు సంభందం ఉంది. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దిక్కున బలాన్ని కలిగి ఉంటుంది. దిక్కులకు నవగ్రహ బలమే కాకుండా అధిపతి బలంకూడా ఉంటుంది. దిక్పతుల, నవగ్రహాల లక్షణాలే దిక్కులకు ఉంటాయి. వీటినే మనం మంచి చెడు గా వర్గీకరిస్తున్నాము.

తూర్పుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరతుడు,పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వరుణుడు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి ఈశ్వరుడు అధిదేవతలుగా ఉన్నారు. వీరిలో దక్షిణానికి అధిపతియైన యముడు నైరుతి అధిపతి యైన నిరతుడు అధిక చెడునుకలిగిస్తారు. ఇక పడమర అధిపతి వరుణుడు సమయానుకూలంగా చెడును కలిగించగలడు. అనేక రకాలైన పీడనలకు ఇతను కారకుడు. ఇక ఆగ్నేయ దిక్కు తూర్పు వైపు చెడును అదేవిధంగా దక్షిణనం వైపు మంచిని కలిగిస్తుంది. అదేవిధంగా వాయవ్యం ఉత్తరం వైపు చెడును పడమర వైపు మంచిని కలిగిస్తుంది. ఇక మిగిలిన దిక్కులు సహజంగా మంచినే కలిగిస్తాయి. అందుకనే తూర్పు ఉత్తరం ఈశాన్యం  దిక్కులను మంచివి అంటాము. మనిషి సుఖ జీవనానికి మంచిని కలిగించే ఈ దిక్కుల బలాన్ని పెంచి చెడును కలిగించే దిక్కుల బలాన్ని కావలిసినంత మేరకే ఉపయోగించుకోవలసి ఉంటుంది. ఇది దిక్పతుల వివరణ.
రవి మొదలగు నవగ్రహాలు భూమిపై వాటి ప్రభావాలను  తమ కిరణాల ద్వారా  చూపిస్తాయి. ఈ విషయాన్ని మన మహర్షులు చాలా చక్కగా వివరించారు. నవగ్రహాలు ప్రసారం చేసే కిరణాలను మనం కాస్మిక్ రేస్ అని అంటాము. నవగ్రహాలలోకొన్ని  శుభ గ్రహాలు మరికొన్నిఅశుభ గ్రహాలు ఉంటాయి. శుభ గ్రహాల నుండి వచ్చే cosmic rays శుభ ఫలితాలను అశుభ గ్రహాల నుండి వచ్చే కిరణాలు అశుభ ఫలితాలను ఇస్తాయి. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దిక్కులో బలం కలిగి ఉంటుంది. శుభ గ్రహాల ఆధిపత్యం లేదా బలం కలిగిన దిశలు మంచి ఫలితాలను ఇస్తాయి. అశుభ గ్రహాల బలం కలిగిన దిశలు చెడు ఫలితాలను ఇస్తాయి. ఇదే అసలు రహస్యం.దిక్కుల మంచి చెడు, దిక్కులకు ఆధిపత్యం వహిస్తున్న గ్రహం మరియు దిక్పతి పై ఆధారపడి ఉంటుంది. ఇదే వాస్తుకు జోతిష్యానికి ప్రధాన సంభందం. వాస్తుకు జ్యోతిష్యం తో సంభందం లేదు అన్న వాదన సరియైనది కాదు. నవగ్రహాలు భూమి పై వివిధ దిక్కుల ద్వారా తమ ఫలితాలను ప్రసారం చేస్తాయి.గ్రహాలలో శుభులెవరూ  అశుభులెవరో తెలుసుకొంటే దిక్కుల గురించిన పూర్తి అవగాహన వస్తుంది.. ఈ శ్లోకం గమనించండి
                        క్షీణేన్దు మందర విరాహు శిఖక్షమాజా:
                                పాపాస్తు పాపయుత చంద్ర సతశ్చ్హ పాప:
                                తేషాను తీవ శుభ దౌ గురు దాస వేశ్యౌ
                                క్రూరా దివాకర సూతక్షితి ఔ భవేతాం.
పై శ్లోకం ప్రకారం క్షీణ చంద్రుడు, రవి,శని, రాహు,కేతు మరియు పాపులతో కలసిన బుధుడు అశుభ గ్రహాలు. గురు,శుక్ర, మరియు శుభులతో కలిసిన బుధుడు, ఇంకా పూర్ణచంద్రుడు శుభ గ్రహాలుగా వర్గీకరించబడ్డాయి.
 కొన్ని దిక్కులందు శుభ గ్రహాలు బలంగాఉంటాయి. కొన్ని దిక్కులందు అశుభ గ్రహాలు బలంగా ఉంటాయి. శుభగ్రహాలు బలంగా ఉన్న దిక్కులు శుభఫలితాలను, అశుభగ్రహాలు బలంగా ఉన్న దిక్కులు అశుభఫలితాలను భూమి పైకి ప్రసరింపచేస్తాయి. ఇదే దిక్కులలోని శుభ అశుభ ఫలితాల మర్మం. ఏయే దిక్కులందు ఏ గ్రహం బలంగా ఉంటుందో ఈ క్రింది శ్లోకం తెలియజేస్తుంది.
ప్రాచ్యామ్ శక్తౌసౌమ్యాజీవాయామ్యాయాం రవి మంగళౌ
మందో బలీప్రతిచ్యాంచ కుబేర్యామ్ చంద్ర భార్గవౌ
ఈ శ్లోకం ప్రకారం బుధుడు, గురుడు తూర్పున బలవంతులు. రవి కుజులు దక్షిణాన బలవంతులు. శని గ్రహం పశ్చిమంలో బలవంతుడు. ఉత్తరం నందు చంద్ర శుక్రులు బలవంతులు. వీటిని గ్రహ దిగ్బలములు అంటారు. అదే విధంగా నవగ్రహాలను దిక్కులకు అధిపతులుగా మన మహర్షులు నిర్ణయించారు. ఈ విధమైన విభజనలో ఏకాశితపదవిన్యాసంలో రాహువు నైరుతి లో, కేతు వు వాయవ్యంలో ఉంటారు. పై వర్గీకరణ ప్రకారం శుభగ్రహాలు తూర్పు ఉత్తర ఈశాన్య దిక్కులలో బలంగా ఉండుట వలన ఈ దిక్కులు పూజనీయమైనివి గా పరిగణింపబడుచున్నవి. అదే విధంగా దక్షిణం పడమర నైరుతి మొ| దిక్కులలో పాప గ్రహాలు బలంగా ఉండుటవలన ఈ దిక్కులుతో జాగ్రత్తగా ఉండాలని వాస్తు తెలుపుతుంది. ఏ గృహాన్నైనా తూర్పు ఉత్తరాలను, పశ్చిమ దక్షిణాల కన్నా అధిక ఖాళీ ఉంచి నిర్మించాలని వాస్తు  ఆదేశిస్తుంది. నవగ్రహ మండలాన్ని మనం గమనించినట్లైతే ఈ దిక్కులందు శుభగ్రహాల బలం ఉంటుంది.ఈ శ్లోకం గమనించండి....
                        మధ్యే వర్తులాకార మండలే రవి:
                                ఆగ్నేయ దిగ్భాగే చతురస్రమండలే చంద్ర:
                                దక్షిణ దిగ్భాగే త్రికోణాకార మండలే కుజ:
                                ఈశాన్య దిగ్భాగే బాణాకార మండలే బుధ:
                                ఉత్తర దిగ్భాగే దీర్గ చతురస్రమండలే గురు:
                                ప్రాగ్ భాగే పంచకోణాకార మండలే శుక్ర:
                                పశ్చిమ దిగ్భాగే ధనురాకార మండలే శని:
                                నైరుతి దిగ్భాగే సూర్పాకారమండలే రాహు:
                                వాయవ్య దిగ్భాగే ధ్వజాకార మండలే కేతు:  ----            “సూర్యసిద్ధాంతం”                                                                                                        
నవగ్రహ మండలంలో తూర్పు, ఉత్తర ,ఈశాన్యంలో శుభ గ్రహాలైన గురు, బుధ శుక్రులు ఉంటారు. ఈ గ్రహాలు   శుభమైన కిరణాలను లేదా cosmic rays ప్రసారం చేస్తాయి. వీటి వలన గృహస్తుకు శుభఫలితాలు వస్తాయి. ఈ గ్రహాల శుభదృష్టి మనిషి మనుగడకు, సుఖ జీవనానికి అవసరం. కనుక ఈ దిక్కులందు అధిక ఖాళీ స్థలం వదిలినట్లైతే అధిక ప్రదేశంలో ఈ గ్రహ దృష్టి పడి సుఖ శాంతులు కలుగుతాయి.ఈ దిక్కులలో  అధిక ఖాళీ ఉంచి ఇంకా తేలికగా బరువులు వేయకుండా ఉంచితే అధికంగా శుభ గ్రహాల మరియు దిక్పతుల ప్రభావం పడి గృహస్తుకు అధిక సుఖ శాంతులు లభిస్తాయి. కనుకనే ఈ దిక్కులందు అధిక మైన ఖాళీ స్థలం వదలమని వాస్తు చేపుతుంది. ఈ గ్రహ దృష్టి కోసమే ఈ దిక్కులను విశాలంగా మరియు పవిత్రంగా ఉంచాలి.
అశుభ గ్రహాల దృష్టి లేదా cosmic rays వీలైనంత తక్కువగా పడాలి కనుక నవగ్రహామండలంలో  పాపగ్రహాల బలం కలిగిన దక్షిణ పశ్చిమ నైరుతి ఆగ్నేయ వాయవ్య  దిక్కులందు తక్కువ స్థలం వదలాలి. ఈ గ్రహాల కిరణాలకు అవరోధం ఉండాలి. కనుకనే ఈ దిక్కులలో బరువులు వుంచి తక్కువ స్థలం వదిలితే గృహస్తుకు సమస్యలు రావు. అంటే చెడును ప్రసాదించే దిక్కులలో తక్కువ ఖాళీ స్థలం వదలి, మంచిని కలిగించే దిశలలో ఎక్కువ ఖాళీ స్థలం వదిలినట్లైతే మనిషి జీవితం శుభ గ్రహ దృష్టి వలన సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. కనుకనే మంచి దృష్టిని ప్రసాదించే తూర్పు ఉత్తర ఈశాన్యంలో ఎక్కువ ఖాళీ స్థలం వదలి ప్రతికూల దృష్టిని ప్రసారం చేసే దక్షిణ పశ్చిమ మొ|లగు దిక్కులలో తక్కువ ఖాళీ స్థలం వదలమని వాస్తు  ఆదేశిస్తుంది.
గ్రహం మరియు దిక్పతుల ప్రభావం సరిగా ఉండటానికి ఇంటికి 4 ప్రక్కల ఖాళీ స్థలాన్ని వదలాలి. హద్దులపై నిర్మాణం ఉండకూడదు. చెడును ప్రసాదించే దిక్కులను కూడా కావలసినంత మేరకు ఉపయోగించుకోవాలి. అప్పుడే  మంచి ఫలితాలు వస్తాయి. సమస్యలు దక్షిణం పడమర దిశల నుండి ఉంటాయని ఈ దిశలకు ఇంటిని ఖాయం చేసి ఖాళీ వదలకుండా నిర్మించకూడదు. ఈ విధంగా ఇంటిని నిర్మిస్తే నైసర్గిక వాస్తు దోషం సోకుతుంది. మన మహర్షులు 4 ప్రక్కల ఖాళీ స్థలాన్ని వదలిన ఇంటికి వాస్తుదోషం ఉండదని చెప్పడం జరిగింది.
                        చతుర్ద్వారే గృహేచైవ వాస్తు దొషో న విద్యతే.------   నారద సంహిత.

 4 ప్రక్కల స్థలం వదలి ద్వారాలను అమర్చితే గృహానికి వాస్తు దోషం ఉండదని పై శ్లోకం తెలుపుతోంది. ఇంటికి 4 ప్రక్కల ద్వారాలను అమర్చితే శుభఫలితాలు వస్తాయి. తూర్పు ద్వారం వలన దైవ భక్తి, ఉత్తర ద్వారము వలన సిరి సంపదలు దక్షిణ ద్వారం వలన సకల సౌఖ్యాలు, ఇంకా పశ్చిమ ద్వారం వలన ధనం ధాన్యం వంటి లాభాలు కలుగుతాయని మన మహర్షులు చెప్పడం జరిగింది. కనుక శుభ ఫలితాలకు గృహానికి 4 ప్రక్కల పిశాచ భాగం వదలి గృహాన్ని నిర్మించుట మంచిది.